Wednesday, November 12, 2008

కార్తీక దీప బ్రమ్హొస్తవ ఆలయం

ప్రభుదేవరాయ రాజు ప్రార్ధనను మన్నించి సుబ్రహ్మన్నేశ్వర స్వామి స్తంభంలోనించి దర్శనమిచ్చిన ప్రదేశం. ఆ స్తంభాన్ని ఇప్పటికి మనం దర్శించుకోవచ్చు. దక్షిణాన పవిత్ర జలాలతో నిండిన శివగంగ తీర్ధం కొనేరు ఉంది. సర్వసిద్ది వినాయక ఆలయం ఈ తీర్ధం తీరాన ఉంది. కళ్యాణ సుందర మూర్తి. పెద్దనందిని ఇక్కడే మనం దర్శించవచ్చు. వల్లిదెవసేనాసమేత శన్న్ముఖుడికి ధరింప జేసిన దండాయుధం ఇప్పటికీ ఉంది. గోపురం దాటి లోనికి వెళితే శక్తి విలాస సభ కళ్యాణ మండపం కాల భైరవ సన్నిది ఉంటాయి. ఎదురుగా భ్రహ్మతీర్ధం. ఐదవ ప్రాకారంలో వెయ్యీ స్తంభాల మండపం దర్శనమిస్తుంది. దిగువ మెట్లు దిగి వెళితే పాతాల లింగ ఆలయం ఉంది. ఇక్కడ రమణ మహర్షి ధ్యాన సమాధిలో ఉండేవారు. మూడవ ప్రాకారంలో కిళి (చిలుక) గోపురం, వినాయక, సుబ్రమణ్య, భైరవ ఆలయాలున్నాయి. ఇక్కడే కంచి మండపం ఉంది. మూడవ ప్రాకారంలో వాయువ్య భాగాన అమ్మవారి సన్నిధి, ముందు మండపంలో చిత్రగుప్తుని దర్సనం, అమ్మవారి సన్నిధి, సంబంధర్ దశకం. పాలై అమ్మనై పాటలు శిలాశాసనాలు ఉన్నాయ్. అమ్మవారి మూలవిరాట్టు చిన్నరుపం శోభాయమానంగా దర్సనం ఇస్తుంది. నేరుగా కాళహస్తీశ్వర లింగం ఉంటుంది. ఈ ఆలయం ముందు వీరభద్ర, అష్టలక్ష్మిలు, సరస్వతి, రుద్ర, దుర్గరుపాలను చూడవచ్చు. వెనుక విఘ్నేశ్వరుని దర్శించాలి. అమ్మవారి ముగ్దమనోహర రూపం దర్శించినంతనే దయాసాగరిక కరుణా కటాక్షాలు మనపై అపారంగా వర్షిస్తాయి. సంస్కృతంలో ఈ అమ్మవారిని అపీత కుచంబగా పిలుస్తారు. రెండవ ప్రాకారంలో గణపతి, సుబ్రమణ్య ద్వారపాలకులు ఉంటారు. ఉతరాన ఉత్సవ విగ్రహాలు, దక్షిణాన ఇంద్రలింగం ఉన్నాయ్.

--మల్లాది రామలక్ష్మి

వార్త (06.11.2008)